AP News: హాస్టళ్లలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయం : సీఎం జగన్
ABN , First Publish Date - 2022-09-23T00:20:53+05:30 IST
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) సంక్షేమ హాస్టళ్లపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు – నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ బాధ్యతల పర్యవేక్షణ ఎంఈవోలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో టీవీ(TV), ఇంటర్నెట్ (Internet) సదుపాయం
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) సంక్షేమ హాస్టళ్లపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు – నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ బాధ్యతల పర్యవేక్షణ ఎంఈవోలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో టీవీ(TV), ఇంటర్నెట్ (Internet) సదుపాయం కల్పించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్ల (Welfare hostels)పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్, స్థానిక పీహెచ్సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.