మీ అనుచరులకు ఇది మంచిది కాదు: Pawan Kalyan
ABN , First Publish Date - 2022-06-25T02:08:12+05:30 IST
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై పార్టీ అధినేత
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆడబిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామని హెచ్చరించారు.
మీడియాపై కేసుల నమోదు అప్రజాస్వామికం
‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణం. స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగితే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్ళు రాయపాటి అరుణకి అర్థరాత్రి ఫోన్లు చేసి మానమర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ఏం పధ్ధతి? ఈ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించేందుకు కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం.’’ అని పేర్కొన్నారు.