AP News: రెడ్లకు పెత్తనం ఇచ్చి..ఆ మంత్రుల గొంతు నొక్కారు: కూన రవికుమార్
ABN , First Publish Date - 2022-09-22T23:17:22+05:30 IST
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) రెడ్లకు పెత్తనం ఇచ్చి బీసీ మంత్రుల గొంతు నొక్కుతున్నారని టీడీపీ (TDP) సీనియర్ నేత కూన రవికుమార్ (Ravi Kumar) విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు పెత్తనం కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ మంత్రులకు ఎలాంటి పవర్ లేదని.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్..చెల్లని వేణుగోపాల్గా మారారని విమర్శించారు.
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) రెడ్లకు పెత్తనం ఇచ్చి బీసీ మంత్రుల గొంతు నొక్కుతున్నారని టీడీపీ (TDP) సీనియర్ నేత కూన రవికుమార్ (Ravi Kumar) విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు పెత్తనం కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ మంత్రులకు ఎలాంటి పవర్ లేదని.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్..చెల్లని వేణుగోపాల్గా మారారని విమర్శించారు.
క్యాబినెట్లో వారికి ఆత్మగౌరవం లేదు
‘‘బీసీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. బీసీ మంత్రులకు జగన్ క్యాబినెట్లో ఆత్మగౌరవం లేకుండా పోయింది. బీసీ వర్గాలకు వెన్నెముక లేకుండా చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. పదవులు కాపాడుకోడానికి చంద్రబాబు, లోకేష్ను మంత్రులు తిడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అనేక పథకాలకు సీఎం జగన్ తూట్లు పొడిచారు. బీసీల సంక్షేమానికి చంద్రబాబు (Chandra Babu) ఎంతో కృషి చేశారు. బీసీల్లోని అన్ని వర్గాలకు ఆదరణ పథకంతో ఉపాధి అవకాశాలు కల్పించింది టీడీపీ (TDP) ప్రభుత్వమే’’నని గుర్తు చేశారు.