Nakka anandbabu: మద్య నిషేధం హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2022-09-29T18:05:15+05:30 IST
ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన మద్య నిషేదం హామీ ఏమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.
గుంటూరు: ఎన్నికల ముందు వైసీపీ (YCP) ఇచ్చిన మద్య నిషేదం హామీ ఏమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka anand babu) ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నమ్మి ఓట్లేసి గెలిపించిన మహిళల్ని జగన్ వంచించారని విమర్శించారు. రాష్ట్రంలో డిస్టిలరీలను బలవంతంగా ఆక్రమించి సొంత బ్రాండ్లను ప్రజలపై రుద్దారన్నారు. ముఖ్యమంత్రే తన అనుచరులతో మద్యం తయారు చేయించి అమ్ముతున్న రాష్ట్రం మనదే అని వ్యాఖ్యలు చేశారు. మద్యం తయారీ, అమ్మకాలు పూర్తిగా జగన్ (AP CM) కనుసన్నల్లో, సజ్జల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు. చీఫ్ లిక్కర్ సీసా కూడా మూడు రెట్లు పెంచి రూ.250, రూ.300కు అమ్ముతున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు.