పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-17T05:05:23+05:30 IST
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
యడ్లపాడు, జనవరి 16: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేట గ్రామానికి చెందిన శ్రీపెరంబదూర్ ఆంజనేయులు(35)కు, ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయలక్ష్మిలతో పదేళ్ళ కిందట వివాహమైంది. వ్యవసాయపనులు చేసుకుని జీవించే వీరికి ఆరేళ్ళ కుమార్తె ఉంది. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లగా ఆంజనేయులు గుంటూరులో ఉంటున్నాడు. శనివారం కొండమూరులోని అత్తగారింట్లో ఉన్న భార్య వద్దకు వెళ్లి తన వెంట రావాలంటూ కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు పురుగుల మందు తాగి ప్రకాశంజిల్లా మార్టూరు ఫ్లైఓవర్ వద్ద పడిపోయాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరచగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు.