20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-10-08T06:15:54+05:30 IST

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 590 అడుగులు ఉంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం.

20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత్‌, అక్టోబరు7: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 590 అడుగులు ఉంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9,047, ఎడమ కాలువ ద్వారా 6,556, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,886 క్యూసెక్కులు, 20 క్రస్ట్‌గేట్లను ఐదుఅడుగుల మేర ఎత్తి 1.62 లక్షల క్యూసెక్కులు, మొత్తం 2,12,889 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,12,889 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులుంది. ఇది 214.84 టీఎంసీలకు సమానం.  

బ్యారేజి దిగువకు 90వేల క్యూసెక్కులు 

 తాడేపల్లి టౌన్‌, అక్టోబరు7:  ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 95,000 క్యూసెక్కులుగానమోదైంది. రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా, 55 గేట్లను 2 అడుగులు, 15 గేట్లు అడుగు మేర ఎత్తి 90,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు పశ్చిమ కాలువలకు 5,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-10-08T06:15:54+05:30 IST