Sabari Express : ముక్కలైతే అమ్ముకుందామని పట్టాలపై ఇనుపరాడ్‌

ABN , First Publish Date - 2022-11-02T06:12:29+05:30 IST

చిత్తుకాగితాలు ఏరుకనేవారు రైలు పట్టాలపై అడ్డంగా పెద్ద ఇనుపరాడ్‌ను కట్టారు. లోకోపైలట్‌ అప్రమత్తతో శబరి ఎక్స్‌ప్రె్‌సకు సోమవారం ..

Sabari Express : ముక్కలైతే అమ్ముకుందామని పట్టాలపై ఇనుపరాడ్‌

లోకోపైలట్‌ అప్రమత్తతతో శబరి ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన ప్రమాదం

గుంటూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): చిత్తుకాగితాలు ఏరుకనేవారు రైలు పట్టాలపై అడ్డంగా పెద్ద ఇనుపరాడ్‌ను కట్టారు. లోకోపైలట్‌ అప్రమత్తతో శబరి ఎక్స్‌ప్రె్‌సకు సోమవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. గుంటూరు కంకరగుంట ఆర్‌వోబీ వద్ద జేసీబీ ద్వారా రైలుపట్టాలకు ఇరువైపులా చెట్లు కొట్టి శుభ్రం చేశారు. 22 అడుగుల పొడవున్న 32 కేజీల ఇనుపరాడ్‌ బయటపడింది. చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు దాన్ని విక్రయించేందుకు యత్నించగా ఎవరూ కొనలేదు. దీంతో రైలు పట్టాలపై ఉంచితే మూడు ముక్కలవుతుందని, అప్పుడు అమ్ముకోవచ్చని భావించారు.

Updated Date - 2022-11-02T06:12:30+05:30 IST