AP News: ఖైదీలకు విముక్తి

ABN , First Publish Date - 2022-08-15T22:10:19+05:30 IST

రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలకు విముక్తి లభించింది. సత్ప్రవర్తనతో మెలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీవితఖైదు అనుభవిస్తున్న48 మందితోపాటు, ఇతర

AP News: ఖైదీలకు విముక్తి

రాజమండ్రి: జగన్ సర్కారు (AP Govt.) కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. దీంతో సత్ప్రవర్తనతో మెలిగిన ఖైదీల వివరాలను జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. జాబితాను ఆమోదించిన ప్రభుత్వం వారిని విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలకు విముక్తి లభించింది. జీవితఖైదు అనుభవిస్తున్న48 మందితోపాటు, ఇతర శిక్షలు  అనుభవిస్తున్న ఏడుగురు, మహిళా ఖైదీలు 11 మందిని మరికొద్ది సేపట్లో జైలు అధికారులు విడుదల చేయనున్నారు.  

Updated Date - 2022-08-15T22:10:19+05:30 IST