నామమాత్రంగా పునరావాస కేంద్రాలు: పవన్
ABN , First Publish Date - 2022-07-20T00:28:37+05:30 IST
అమరావతి: వరద ముంపు బాధితుల కోసం వైసీపీ సర్కార్ పునరావాస కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ విమర్శించారు. వరద బాధితుల గోడు పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని
అమరావతి: వరద ముంపు బాధితుల కోసం వైసీపీ సర్కార్ పునరావాస కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ విమర్శించారు. వరద బాధితుల గోడు పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే.. రాజకీయం చేస్తున్నామని వైసీపీ సర్కార్ ఎదురుదాడికి దిగుతోందని పేర్కొన్నారు. కోనసీమలో ఆహార పొట్లాల కోసం జనం పెనుగులాడుకునే దుస్థితిని కల్పించారని పవన్ మండిపడ్డారు.