Guntur Dist.: కళాకారులతో కలిసి మంత్రి రోజా డ్యాన్స్

ABN , First Publish Date - 2022-11-24T15:52:28+05:30 IST

గుంటూరు జిల్లా (Guntur Dist.): వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను మంత్రి రోజా (Minister Roja) ప్రారంభించారు.

Guntur Dist.: కళాకారులతో కలిసి మంత్రి రోజా డ్యాన్స్

గుంటూరు జిల్లా (Guntur Dist.): వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను మంత్రి రోజా (Minister Roja) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ కళాకారులతో కలిసి డ్యాన్స్ (Dance) చేసి.. అందరినీ ఉత్సాహపరిచారు. అధికార వైసీపీకి చెందిన అనేక మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

వచ్చే నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటక - సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ స్వర్ణోత్సవ సాంస్కృతిక ఉత్సవాలకు మంత్రి రోజా హాజరై వివిధ ఆల్బమ్ పాటలకు డ్యాన్సులు వేసి అందరినీ ఉత్సాహపరిచారు.

Updated Date - 2022-11-24T15:52:31+05:30 IST