షాపులకు తాళాలు..

ABN , First Publish Date - 2022-12-13T23:53:22+05:30 IST

నెలల తరబడి 40 దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షల్లో అద్దెల రూపంలో ఆదాయం వచ్చే దుకాణాలకు తాళాలు వేసి మూలన పెట్టారు.

షాపులకు తాళాలు..
పురపాలక సంఘంలోనిరుపయోగంగా ఉన్న వావిలాల, యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంప్లెక్స్‌లోని గదులు

నిరుపయోగంగా 40 దుకాణాలు

సత్తెనపల్లి మున్సిపాల్టీ ఆదాయానికి గండి

సత్తెనపల్లి, డిసెంబరు 13: నెలల తరబడి 40 దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షల్లో అద్దెల రూపంలో ఆదాయం వచ్చే దుకాణాలకు తాళాలు వేసి మూలన పెట్టారు. పెద్దమొత్తంలో ఆదాయానికి గండి పడుతున్నా అటు అధికారులు, ఇటు పాలకుల్లో చలనం లేదు. అదేమంటే వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదనే సాకుతో తాళాలు వేశారు. సత్తెనపల్లి మున్సిపాల్టీకి సంబంధించి వివిధ సముదాయాల్లో 40 షాపులు నిరుపయోగంగా ఉన్నాయి. వావిలాల షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 10, యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంప్లెక్స్‌లో 6, రాజీవ్‌గాంధీ కూరగాయల మార్కెట్‌లో 21, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో మూడు షాపులకు ఇప్పటికే వీటికి నాలుగైదుసార్లు బహిరంగ వేలం నిర్వహించారు. బహిరంగ వేలం వేసినా పాడుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం పురపాలక సంఘానికి ఉపయోగపడుతుంది. కానీ సంవత్సర కాలంగా షాపుల నుంచి అద్దెలు రావడంలేదు. దీంతో పురపాలక సంఘం రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోయింది. వేలంలో పాల్గొనేందుకు చెల్లించాల్సిన డిపాజిట్‌తో పాటు అద్దెలు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకురావటం లేదని కమిషనర్‌ షమ్మీ తెలిపారు.

Updated Date - 2022-12-13T23:57:57+05:30 IST