అధికార దుర్వినియోగ సభగా జగన్ ప్లీనరీ: Jawahar
ABN , First Publish Date - 2022-07-10T16:02:33+05:30 IST
Vijayawada: టీడీపీ మాజీ మంత్రి జవహర్ గుంటూరు వైసీపీ ప్లీనరీ సమావేశాలపై స్పందించారు. సీఎం జగనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పార్టీ ప్లీనరీని జగన్ భజన సభగా జవహర్ అభివర్ణించారు.
Vijayawada: టీడీపీ మాజీ మంత్రి జవహర్ గుంటూరు వైసీపీ ప్లీనరీ సమావేశాలపై స్పందించారు. సీఎం జగనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పార్టీ ప్లీనరీని జగన్ భజన సభగా జవహర్ అభివర్ణించారు. ప్లీనరిలో పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి విజయమ్మతో రాజీనామా ప్రకటన చేయించాడని, రెండోరోజు మీడియా ఛానళ్లపై వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులతో బూతులు మాట్లాడించాడని విమర్శించారు. యువజన సంక్షేమం, ఉపాధిపై సీఎం నోరు మెదపలేదని, మొత్తంగా చూస్తే అధికార దుర్వినియోగ సభగా జగన్ ప్లీనరి ముగిసిందన్నారు.