Guntur: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం
ABN , First Publish Date - 2022-01-16T14:11:32+05:30 IST
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ స్టువర్ట్ పురం దొంగలు మోసానికి పాల్పడ్డారు.
గుంటూరు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ స్టూవర్ట్పురం దొంగలు మోసానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.31 లక్షల నగదును బురిడీ కొట్టించారు. చివరకు తాము మోసిపోయనట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టూవర్ట్పురంకు చెందిన గురవయ్య, వెంకట్రావు, డేవిడ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.