బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బస్‌స్టాండ్‌ల వద్ద ధర్నా: CPI

ABN , First Publish Date - 2022-07-02T03:00:06+05:30 IST

విజయవాడ: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ..రేపు రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌ల వద్ద ధర్నా చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. జగన్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని

బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బస్‌స్టాండ్‌ల వద్ద ధర్నా:  CPI

విజయవాడ: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ.. జూలై 2వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌ల వద్ద ధర్నా చేయనున్నట్లు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. జగన్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, పదేపదే చార్జీలను పెంచుతుందన్నారు. గత రెండు మాసాలలో ప్రజలపై రూ.1220 కోట్ల ఆర్టీసీ చార్జీల భారాన్ని మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో రూ.10లు ఎక్కువ అని పేర్కొన్నారు. పెంచిన బస్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ  డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-02T03:00:06+05:30 IST