కలెక్టరేట్లో డేటా ప్రాసెసింగ్ సెంటర్
ABN , First Publish Date - 2022-05-27T05:52:22+05:30 IST
కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకి సంబంధించి డేటా ప్రాసెసింగ్ సెంటర్ని కలెక్టరు ఎం. వేణుగోపాల్రెడ్డి ప్రారంభించారు.
గుంటూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకి సంబంధించి డేటా ప్రాసెసింగ్ సెంటర్ని కలెక్టరు ఎం. వేణుగోపాల్రెడ్డి ప్రారంభించారు. గురువారం ఉదయం కలెక్టరుడేటా ప్రాసెసింగ్ సెంటరుని, జేసీ గణియా రాజకుమారి కంప్యూటర్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వినియోగంలో లేని ఆర్ అండ్ బీ బిల్డింగ్ని కలెక్టరు పరిశీలించారు. అలానే కొత్తగా కలెక్టరేట్లో నిర్మించిన లిఫ్టుని లాంఛనంగా ప్రారంభించారు. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకించి నిర్మించిన డైనింగ్ హాల్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్రావు, సర్వే ఏడీ రూప్లా నాయక్, స్పెషల్ కలెక్టర్ భాస్కర్రెడ్డి, ఆర్డీవో ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.