సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-12-07T01:00:23+05:30 IST

సమాజంలో జరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ మహిళా కమిషన్‌ కార్యదర్శి వై.శైలజ తెలిపారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రసంగిస్తున్న మహిళ కమిషన్‌ కార్యదర్శి శైలజ

పెదకాకాని, డిసెంబరు 6 : సమాజంలో జరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ మహిళా కమిషన్‌ కార్యదర్శి వై.శైలజ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం మహిళలపై హింస.... నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజ మాట్లాడుతూ బాలికలపై జరిగే సైబర్‌ నేరాలపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. వాటిపై తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.రత్న కుమార్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని, టెక్నాలజీ చట్టం ముఖ్య ఉద్దేశ్యం, విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్‌ కరుణ, ఎస్సై వెంకటకృష్ణ, డాక్టర్‌ శాంతి, బి.మనోరంజని, గౌరీ శంకరి, శ్రీదేవి, విజయ శ్రీ, విజయలక్ష్మి పాల్గొన్నారు

Updated Date - 2022-12-07T01:00:28+05:30 IST