బస్సు చార్జీల పెంపు దారుణం: సాకే శైలజానాథ్

ABN , First Publish Date - 2022-07-01T02:11:22+05:30 IST

అమరావతి: డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం దారుణమని, వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు

బస్సు చార్జీల పెంపు దారుణం: సాకే శైలజానాథ్

అమరావతి: డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం దారుణమని, వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇటీవల డీజిల్ ధరల పెంపును సాకుగా చూపి దాదాపు రూ.720 కోట్ల భారాన్ని జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపిందన్నారు. ఇప్పుడు మరోసారి డీజిల్ సెస్ పేరుతో బస్సు చార్జీలను పెంచడం అన్యాయమన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో 30-60 కిలోమీటర్లకు రూ.5లు, ఎక్స్ ప్రెస్, మెట్రో బస్సులలో 66-80 కిలోమీటర్లకు రూ.10లు, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఒక్కో టికెట్కు రూ.10లు చొప్పున ధరలు పెంచడం తగదన్నారు.  

Updated Date - 2022-07-01T02:11:22+05:30 IST