భగవద్గీత మానవ జీవన వైవిధ్యానికి ప్రతీక
ABN , First Publish Date - 2022-08-19T05:50:26+05:30 IST
భగవద్గీత మానవ జీవన వైవిధ్యానికి ప్రతీక అని బీజేపీ జాతీయ కార్యవర్గ స భ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు (సంగడిగుంట), ఆగస్టు 18: భగవద్గీత మానవ జీవన వైవిధ్యానికి ప్రతీక అని బీజేపీ జాతీయ కార్యవర్గ స భ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో శ్రీకృష్ణ జన్మాష్టమి సంద ర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షు డు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో భగవద్గీత విశిష్టతపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్ర మంలో విశిష్టఅతిథిగా పాల్గొన్న కన్నా మాట్లాడుతూ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని భగవద్గీత విశ్వ మానవాళి సౌభ్రాతృత్వానికి బాట లు వేసిందన్నారు. ధర్మం, శాంతి, సహనం, పరోప కారాన్ని భగవద్గీత బోధించిందన్నారు. బీజేపీ థార్మి క సెల్ రాష్ట్ర కన్వీనర్ పరవస్తు సత్య గోపినాథ్ దాస్ మాట్లాడుతూ సరైన నడవడిక లేని జీవితం వ్యర్థమన్నారు. అనంతరం విద్యార్ధులకు భగవద్గీత పుస్తకాల వితరణ, భగవద్గీత విశిష్టతపై అవగాహ న సదస్సు జరిగింది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమ్మిశెట్టి ఆంజనేయులు, రమా కుమారి, భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవికు మార్, ఎడమ రాజేష్, ఽఅంకాల శ్రీను, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నార