AP News : మాధవ్ వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకోండి : వాసిరెడ్డి పద్మ
ABN , First Publish Date - 2022-08-06T18:47:35+05:30 IST
Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వీడియో వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy
Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వీడియో వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ప్రభుత్వాన్ని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖ రాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.