యువత వ్యసనాలకు గురికావద్దు
ABN , First Publish Date - 2022-12-31T22:46:41+05:30 IST
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత వ్యసనాలకు గురికాకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని వివిధ సంఘాల నాయకులు హితవు పలికారు.
గోపాలపురం, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత వ్యసనాలకు గురికాకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని వివిధ సంఘాల నాయకులు హితవు పలికారు. యువత జాగ్రత్తగా వ్యవహరిస్తూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు. ఈ సందర్భంగా దొండపూడిలో ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, అరుణోదయ సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్ర మంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు శ్రీనివాస్, పలు సంఘాల నాయకులు అప్పారావు, లక్ష్మీనారాయణ, ఎం.జక్కారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.