కార్మికుల పని తీరుతోనే ఆర్టీసీ ప్రగతి
ABN , First Publish Date - 2022-04-24T06:56:50+05:30 IST
ఉద్యోగులు, కార్మికుల మెరుగైన పనితీరుతోనే ఆర్టీసీ ప్రగతి ఆధారపడి ఉందని విజ యవాడ జోన్-2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 23: ఉద్యోగులు, కార్మికుల మెరుగైన పనితీరుతోనే ఆర్టీసీ ప్రగతి ఆధారపడి ఉందని విజ యవాడ జోన్-2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విజయనగరం జోన్ పరిధిలో ఉన్న అమలాపురం ఆర్టీసీ డిపో జిల్లాల పునర్విభజనలో భాగంగా విజయవాడ జోన్-2 పరిధిలోకి మార్చడం జరిగిందన్నారు. శనివారం ఆకస్మికంగా అమలాపురం ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. డిపోలోని పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్వోప్లాంటును ఏర్పాటుచేసిన లయన్స్క్లబ్ వశిష్ఠ ప్రతినిధులను అభినందించారు. ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు.