వైసీపీ పతనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-29T06:10:13+05:30 IST
తుని, జూన్ 28: అన్నంపెట్టే రైతులకు మోసపూరితమైన హామీలిచ్చి మోసగించడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ రైతు విభాగం ప్రతినిధులతో, రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చే
తుని టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు
తుని, జూన్ 28: అన్నంపెట్టే రైతులకు మోసపూరితమైన హామీలిచ్చి మోసగించడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ రైతు విభాగం ప్రతినిధులతో, రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చెరకు, ధాన్యం రైతులు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అమలుకానీ హామిలతో ప్రజలను మాయచేసి ఓట్లు వేయించుకున్న జగన్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వైసీపీ కార్యకర్తలే ఎదురుచూస్తున్నారన్నారు. వచ్చే నెల 2న జగ్గంపేటలో జరిగే రైతుపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా రైతు విభా గం అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు, కాకినాడ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, కోటనందూరు, తుని, తొండంగి టీడీపీ మండలా ధ్యక్షులు గాడి రాజుబాబు, అప్పన రమేష్, కోడా వెంకటరమణ, పోతల సూరిబాబు, బాబులు, పెంటకోట భాస్కరరావు, పేకేటి హరికృష్ణ, గుడివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.