తెలంగాణ జనసైనికుడి బైకుయాత్రకు స్వాగతం

ABN , First Publish Date - 2022-11-17T01:23:06+05:30 IST

ఏపీ ప్రజల కు మేలుచేసే నాయకుడు పవన్‌కల్యాణ్‌ మాత్రమేనని, ఆయన ముఖ్యమంత్రి కావా లని కోరుతూ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన జన సైనికుడు దీపక్‌ మోటారు సైకిల్‌పై చేపట్టిన ప్రచార యాత్ర బుధవారం అమలాపురం చేరుకుంది.

తెలంగాణ జనసైనికుడి బైకుయాత్రకు స్వాగతం

అమలాపురం టౌన్‌, నవంబరు 16: ఏపీ ప్రజల కు మేలుచేసే నాయకుడు పవన్‌కల్యాణ్‌ మాత్రమేనని, ఆయన ముఖ్యమంత్రి కావా లని కోరుతూ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన జన సైనికుడు దీపక్‌ మోటారు సైకిల్‌పై చేపట్టిన ప్రచార యాత్ర బుధవారం అమలాపురం చేరుకుంది. ఎర్ర వంతెన వద్ద ఆయన ప్రచారం నిర్వహిం చారు. అనంతరం జనసేన కార్యాలయం ప్రాంగణం వద్ద దీపక్‌ను జనసేన నాయకులు సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యాళ్ల నాగసతీష్‌, జనసేన నాయకులు కంచిపల్లి అబ్బులు, లింగోలు పండు, ఆర్డీఎస్‌ ప్రసాద్‌, కొప్పుల నాగమానస, పడాల నానాజీ, పోలిశెట్టి కన్నా, అల్లాడ రవి, తిక్కా సరస్వతి, కరాటం వాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T01:23:08+05:30 IST