కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టు
ABN , First Publish Date - 2022-07-01T06:43:09+05:30 IST
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు అని మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.
అంతర్వేది, జూన్ 30: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు అని మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శృంగవరప్పాడు గ్రామం ఓల్డేజ్ హోం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పర్తి నాని అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలున్నారన్నారు. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారదోరాల్సిన సమయం ఆసన్న మైందని, అది టీడీపీ కార్యకర్తలతోనే సాధ్యమన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మూడేళ్ల రాష్ట్రం ఏవిధంగా నష్టపోయిం దో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంద న్నారు. అనంతరం ఇటీవల టీడీపీలో చేరిన రుద్రరాజు వెంకట్రామరాజును ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ వైఎస్ ఎంపీపీ బత్తుల రవీంద్రనాథ్ జన్మదిన వేడు కలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడి సత్యనారాయణ, పోతురాజు కృష్ణ, వనమాలి మూలా స్వామి, కొల్లాబత్తుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.