రేపు ఎస్ఎ్ఫఐ జిల్లా మహాసభలు
ABN , First Publish Date - 2022-12-07T00:13:52+05:30 IST
ఎస్ఎ్ఫఐ 28వ జిల్లా మహాసభలను గురువారం కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. పోస్టర్ను కాకినాడ పీఆర్ కళాశాల గేటు వద్ద మంగళవారం ఎస్ఎ్ఫఐ జిల్లా కార్యదర్శి టి.రాజా ఆవిష్కరించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ, సంక్షేమ వసతిగృహాల్లో సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాసభలను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. ఈ
కాకినాడ రూరల్, డిసెంబరు 6: ఎస్ఎ్ఫఐ 28వ జిల్లా మహాసభలను గురువారం కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. పోస్టర్ను కాకినాడ పీఆర్ కళాశాల గేటు వద్ద మంగళవారం ఎస్ఎ్ఫఐ జిల్లా కార్యదర్శి టి.రాజా ఆవిష్కరించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ, సంక్షేమ వసతిగృహాల్లో సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాసభలను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, ఎస్ఎ్ఫఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ పాల్గొంటున్నారన్నారు.