ఎస్‌ఈబీ జేడీగా సోమశేఖరరావు బాధ్యతలు

ABN , First Publish Date - 2022-12-22T00:35:02+05:30 IST

సారాపై 94932 06171కు 24గంటలూ ఫిర్యాదు చేయవచ్చ

ఎస్‌ఈబీ జేడీగా సోమశేఖరరావు బాధ్యతలు

రాజమహేంద్రవరం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) జాయింట్‌ డైరెక్టర్‌గా పి.సోమశేఖరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రమాదేవి ఎస్పీగా పదోన్నతిపై వెళ్లిన సంగతి తెలిసిందే. సోమశేఖరరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో సారా తయారీని అరికడతానన్నారు. సారా తయారీకి అవసరమైన ముడిసరుకు లు బెల్లం తదితర పదార్ధాలు అమ్మినా, పెట్టుబడిపెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో కంట్రోలు రూమ్‌ నంబర్‌ 94932 06171కు సారాపై 24గంటలూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Updated Date - 2022-12-22T00:38:49+05:30 IST