రోడ్డు కం రైలు బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు
ABN , First Publish Date - 2022-08-10T06:26:28+05:30 IST
కొవ్వూ రు రోడ్ కం రైలు బ్రిడ్జిపై ఆర్అండ్బీ అధి కారులు మంగళవారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
కొవ్వూరు, ఆగస్టు 9 : కొవ్వూ రు రోడ్ కం రైలు బ్రిడ్జిపై ఆర్అండ్బీ అధి కారులు మంగళవారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కొవ్వూ రు వైపు రోడ్డును ఆనుకుని ఉన్న ఫుట్పాత్ కుంగిపోవడంతో పాదచారులు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు. దీనిపై ఆర్అండ్బీ ఈఈ ఎస్బీవీ రెడ్డి, డీఈ బి.వి. మధుసూదన్లు మాట్లాడుతూ రోడ్డు కం రైలు వంతెనకు కొవ్వూరు వైపున 20 మీటర్లు, రాజమహేంద్రవరం వైపున 70 మీటర్ల పొడవున కిందన ఉన్న ఐరన్ బీమ్లు తుప్పు పట్టడంతో పైన ఉన్న స్లాబ్లు కుంగిపోయి ప్రమాదకరంగా తయారైందన్నారు.శాశ్వత చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించామన్నారు.మొదటి విడతగా రూ.10 లక్షలు మంజూరయ్యాయన్నారు.ఆర్అండ్బీ జేఈ బి.కిషోర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.