పంట పెట్టుబడి సొమ్ములపై గగ్గోలు

ABN , First Publish Date - 2022-03-05T06:00:45+05:30 IST

సామర్లకోట, మార్చి 4: మండలంలోని పెదబ్రహ్మదేవంలో అధికశాతం రైతులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పంట పెట్టుబడి రాయితీ సొమ్ములు అర్హులకు గాకుండా పొలంలేని, సీసీఆర్‌సీ కార్డులు లేని అనర్హుల ఖాతాలకు బదిలీ చేయడం పట్ల పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మండల్యాధుక్షుడు తోటకూర శ్రీనువాసు ఆధ్వర్యంలో గ్రామ రైతుభరోసాకేంద్రం వద్ద శుక్రవారం రైతుల ఆందోళన చేపట్టిన సమాచారం తెలి

పంట పెట్టుబడి సొమ్ములపై గగ్గోలు
వ్యవసాయ సిబ్బందితో మాట్లాడుతున్న రాజప్ప

పెదబ్రహ్మదేవంలో ఎమ్మెల్యే రాజప్ప ఎదుట రైతుల ఆవేదన

సామర్లకోట, మార్చి 4: మండలంలోని పెదబ్రహ్మదేవంలో అధికశాతం రైతులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పంట పెట్టుబడి రాయితీ సొమ్ములు అర్హులకు గాకుండా పొలంలేని, సీసీఆర్‌సీ కార్డులు లేని అనర్హుల ఖాతాలకు బదిలీ చేయడం పట్ల పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మండల్యాధుక్షుడు తోటకూర శ్రీనువాసు ఆధ్వర్యంలో గ్రామ రైతుభరోసాకేంద్రం వద్ద శుక్రవారం రైతుల ఆందోళన చేపట్టిన సమాచారం తెలిసి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేరుకున్నారు. ఏవో ఐ.సత్య, గ్రామ వ్యవసాయ సిబ్బందిని ఆరా తీశారు. వారి నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో విషయాన్ని రాజప్ప జిల్లా వ్యవసాయ జేడీ విజయకుమార్‌ దృష్టికి ఫోన్‌ ద్వారా తీసుకువెళ్లారు. సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే వారితో ఉద్యమిస్తామని జేడీకి స్పష్టం చేశారు. రైతు ప్రతినిధిగా సమస్యను తెలిపానని, రాజకీయాలతో సంబంధం లేకుండా సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే పార్టీ పరంగా కార్యాచరణ చేపడతామన్నారు. టీడీపీ నాయకులు మార్ని వీరభద్రరావు, గోలి శ్రీను, తోటకూర సత్యనారాయణ, చంటియ్య, మల్లిపూడి సత్తిబాబు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:00:45+05:30 IST