ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధం
ABN , First Publish Date - 2022-07-01T06:44:51+05:30 IST
శుక్రవారం నుంచి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలు చేస్తున్నందున నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల క్రయ, విక్రయాలు జరిపితే జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కమిష నర్ వి.అయ్యప్పనాయుడు తెలిపారు.
అమలాపురం టౌన్, జూన్ 30: శుక్రవారం నుంచి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలు చేస్తున్నందున నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల క్రయ, విక్రయాలు జరిపితే జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కమిష నర్ వి.అయ్యప్పనాయుడు తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆదేశా లతో తొలివిడతగా 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలి గిన వర్జిన్ లేదా రీసైకిల్ ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర పదహారు రకాల ప్లాస్టిక్ వస్తువులు అనగా... ప్లాస్టిక్ ఇయర్బడ్స్, బెలూ న్స్, క్యాండీ, ఆహ్వాన పత్రికలు, వంద మైక్రాన్లలోపు ఉండే పీవీసీబ్యానర్లు, అలంకరణ కోసంవాడే ధర్మోకోల్లను పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. గురువారం కమిషనరు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణితో కలిసి సంఘ కార్యాల యం వద్ద నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే రూ.500నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించి, ట్రేడ్లైసెన్సు రద్దుచేస్తామన్నారు. అమలా పురాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు.