నర్సరీ సందర్శించిన తెలంగాణ ఐఏఎస్‌

ABN , First Publish Date - 2022-12-07T02:10:40+05:30 IST

కడియం మండలం బుర్రిలంకలోని రత్నం అయ్యప్పకు చెందిన ఏకెఎస్‌వీ నర్సరీని మంగళవారం తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌, అచల దంపతులు సందర్శించారు.

నర్సరీ సందర్శించిన తెలంగాణ ఐఏఎస్‌

కడియం, డిసెంబరు 6: కడియం మండలం బుర్రిలంకలోని రత్నం అయ్యప్పకు చెందిన ఏకెఎస్‌వీ నర్సరీని మంగళవారం తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌, అచల దంపతులు సందర్శించారు. ఫల, పుష్ప, ఆర్నమెంటల్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ తదితర పలు రకాల మొక్కలు, పెంపకం, నర్సరీ వ్యవస్థ వంటి విషయాలపై అయ్యప్పను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏపీ ఇరిగేషన్‌ ఎస్‌ఈ కె నరసింహమూర్తి, ఈఈ గోదావరి డివిజన్‌ ఆర్‌ కే విశ్వేశ్వరరావు, నర్సరీ రైతులు తాడాల వెంకటేశ్వరరావు, రత్నం దొరబాబులు ఉన్నారు.

Updated Date - 2022-12-07T02:10:41+05:30 IST