స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి

ABN , First Publish Date - 2022-08-16T07:30:52+05:30 IST

నల్లజర్ల, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్న వైనమిది. నల్లజర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్‌ ఉద్యోగులు, ఎంపీపీ బంకా జయలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అయితే జాతీయ జెండా తిరగబడింది. కాషా

స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి
తిరగబడిన జాతీయ జెండాకి సెల్యూట్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

తిరగబడిన జాతీయ జెండా.. నల్లజర్లలో ఘటన

నల్లజర్ల, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్న వైనమిది. నల్లజర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్‌ ఉద్యోగులు, ఎంపీపీ బంకా జయలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అయితే జాతీయ జెండా తిరగబడింది. కాషాయం రంగు కిందికి, ఆకుపచ్చ రంగు పైభాగంలో ఉన్నప్ప టికీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం గమనించకుండా జెండాకు సెల్యూట్‌ చేసి ఎవరికి వారు వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని ప్రచారం కోసం వైసీపీ సోషల్‌ మీడియా మండల ప్రతినిధి తమ ఫేస్‌బుక్‌లో పెట్టారు. దాంతో ఈ విషయం గమనించిన కొందరు జరిగిన తప్పిదాన్ని ఎత్తిచూపుతూ కామెంటు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.

Updated Date - 2022-08-16T07:30:52+05:30 IST