జడ్పీటీసీ భర్తపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2022-08-17T06:07:16+05:30 IST
సామర్లకోట మండల జడ్పీటీసీ ఎలిశెట్టి అమృత భర్త వైసీపీ నాయకుడు ఎలిశెట్టి నరే్షపై పి.వేమవరం గ్రామానికి చెందిన సమీప బంధువైన రామ్గోపాల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
సామర్లకోట, ఆగస్టు 16: సామర్లకోట మండల జడ్పీటీసీ ఎలిశెట్టి అమృత భర్త వైసీపీ నాయకుడు ఎలిశెట్టి నరే్షపై పి.వేమవరం గ్రామానికి చెందిన సమీప బంధువైన రామ్గోపాల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పట్టపగలే అందరూ చూస్తుండగానే రామ్గోపాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో బలంగా నరేష్ మెడపై వేటువేశాడు. అది తప్పించుకునే ప్రయత్నంలో ఎడమచేయి అడ్డుపెట్టుకోవడంతో మోచేతి కిందిభాగం కత్తివేటుకు గురైంది. దీంతో రక్తస్రావంతో ఉన్న నరే్షను కుటుంబసభ్యుల సహకారంతో పనసపాడు ఏడీబీ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం నరేష్ కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. కొంతకాలంగా వారి రెండు కుటుంబాల మధ్య పొలం సరిహద్దు తగాదాలు ఉన్నట్లు సమాచారం. కోర్టులో కేసులు సైతం నడుస్తున్నాయి. గ్రామంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని పలువురు నాయకుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న తరుణంలో రామ్గోపాల్ కత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తిమ్మాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. రామ్గోపాల్ కోసం గాలింపు చేపట్టారు. భూవివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడ్డారని నరేష్ తండ్రి ఎలిశెట్టి భీమన్నదొర పోలీసులకు చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఉన్న నరేష్ భార్య ఎలిశెట్టి అమృత ఆసుపత్రికి చేరుకున్నారు.