మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-08-07T06:51:45+05:30 IST

తాళాలు వేసి ఉన్న మోటారు సైకిళ్లను అపహ రించుకుపోతున్న దొంగను పోలీసులు పట్టుకుని అతడి వద్ద నుంచి 20 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
20 బైక్‌లు స్వాధీనం చేసుకున్న రావులపాలెం పోలీసులు

రావులపాలెం రూరల్‌, ఆగస్టు 6 : తాళాలు వేసి ఉన్న మోటారు సైకిళ్లను అపహ రించుకుపోతున్న దొంగను పోలీసులు పట్టుకుని అతడి వద్ద నుంచి 20 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లాలో వరుస మోటారు సైకిళ్ల దొంగతనాలు జరుగుతున్న నేప థ్యంలో ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆదే శాలతో ఇన్‌చార్జి ఎస్‌ఐ సురేంద్ర, ఏఎస్‌ఐ కనకరాజు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కొత్తపేట మండలం మందపల్లికి చెందిన ఏసుకోన రామకృష్ణ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. రావులపాలెం, జొన్నాడ, అమలాపురం, అయినవిల్లి, కొత్తపేట, కడియపులంక పశ్చిమగోదావరి జిల్లా కూళ్ల, సిద్ధాంతం, అన్నవరప్పాడు, ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 23 మోటారు సైకిళ్లు దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. ఆయా మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టుకు తరలించారు.



Updated Date - 2022-08-07T06:51:45+05:30 IST