జాతీయ లోక్అదాలత్లో 1004 కేసులకు విముక్తి
ABN , First Publish Date - 2022-08-14T07:46:21+05:30 IST
అమలాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల విలువైన 1,004 కేసులు పరిష్కారమయ్యాయి.

రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
అమలాపురం టౌన్, ఆగస్టు 13: అమలాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల విలువైన 1,004 కేసులు పరిష్కారమయ్యాయి. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ వి.నరేష్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించారు. 959 క్రిమినల్ కేసులు, 24 ఎక్సైజ్ కేసులు, 12 సివిల్ దావాలు, 9 యాక్సిడెంట్ కేసులు ఒకేరోజు పరిష్కారమయ్యాయి. సీనియర్ సివిల్ జడ్జి కే శైలజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి వై.శ్రీలక్ష్మి, లోక్అదాలత్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు.