కుష్ఠువ్యాధి అనుమానిత కేసులను నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T00:38:25+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న ఎల్‌సీడీసీ సర్వేలో కుష్ఠువ్యాధి అనుమానిత కేసులను ఎక్కువ గా నమోదుచేయాలని కుష్ఠువ్యాధి నిర్మూలన అడిషనల్‌ డైరె క్టర్‌ డాక్టర్‌ జె.యాస్మిన్‌ సూచించారు.

కుష్ఠువ్యాధి అనుమానిత కేసులను నమోదు చేయాలి

దివాన్‌చెరువు, నవంబరు 22 : ప్రస్తుతం జరుగుతున్న ఎల్‌సీడీసీ సర్వేలో కుష్ఠువ్యాధి అనుమానిత కేసులను ఎక్కువ గా నమోదుచేయాలని కుష్ఠువ్యాధి నిర్మూలన అడిషనల్‌ డైరె క్టర్‌ డాక్టర్‌ జె.యాస్మిన్‌ సూచించారు. తద్వారా కేసులను కనుగొనేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ప్రతిఒక్క రినీ తప్పక పరీక్షించాలని తెలిపారు పాలచర్లలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. కుష్ఠు వ్యాధి గుర్తింపు ప్ర చార కార్యక్రమం (ఎల్‌ిసీడీసీ)లో సర్వే జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును ఆ మె పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఏఎల్‌టీవో డాక్టర్‌ వసుంధర, జిల్లా లెప్రసీ నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మీదేవి, పాలచర్ల పీహెచ్‌ సీ వైద్యాధికారి డాక్టర్‌ బెనడిక్ట్‌, ఎంిపీహెచ్‌ఎస్‌ ఎన్‌.వి.వి. రమణ. పాల్గొన్నారు.

కుష్ఠువ్యాధిపై ఇంటింటి సర్వే

సీతానగరం: మండలంలోని ముగ్గుళ్ళ ఎస్పీపేటలో కుష్ఠువ్యాధిపై ఇంటింటి సర్వేను స్థానిక ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్‌ అసిస్టెంట్‌ సుంకర నగేష్‌బాబు చేపట్టారు. మంగళవారం ముగ్గుళ్ళ ఎస్పీపేటలో ఇంటింటి పెళ్లి కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పిస్తూ హెల్త్‌ అసిస్టెంట్‌ నగేష్‌బాబు ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతిఇంటికీ వెళ్లి మచ్చలు ఉన్నా యా అంటూ ఆరాతీసి, మచ్చలు ఉన్న వారిని పరిశీలించారు.

Updated Date - 2022-11-23T00:38:27+05:30 IST