కోట సత్తెమ్మ ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-12-07T02:07:02+05:30 IST

కోట సత్తెమ్మ అమ్మవారి ట్రస్ట్‌ బోర్డు దేవాలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు అన్నారు.

కోట సత్తెమ్మ ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం

నిడదవోలు, డిసెంబరు 6 : కోట సత్తెమ్మ అమ్మవారి ట్రస్ట్‌ బోర్డు దేవాలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు అన్నారు. మంగళవారం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో నూతన ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు మాట్లాడుతూ నూతన ట్రస్ట్‌ బోర్డు రెండు సంవత్స రాలపాటు సేవలు అందిస్తుందని అన్నారు. ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ చైర్మన్‌గా దేవులపల్లి రామసుబ్బరాయశాస్ర్తి, ధర్మకర్తల మండలి సభ్యులుగా గాజుల రంగారావు, అయినీడి వెంకటకృష్ణ, మిద్దే శ్రీను, రేలంగి మారుతీ శివ భాస్కరరావు, ఉర్ల వీర వెంకటలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, వద్దిరెడ్డి మహాలక్ష్మి, నిచ్చెనకోళ్ళ భవాని, ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావుశర్మ ప్రమాణ స్వీకారం చేయగా, ఈ కార్యక్రమంలో వైసీసీ మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు, గ్రామ సర్పంచ్‌ ఎమ్‌.చంద్రశేఖర్‌, ఎంపీపీ తిరుమళ్ళ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ పడాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T02:07:03+05:30 IST