స్కేటింగ్‌ పోటీల్లో ప్రతిభ

ABN , First Publish Date - 2022-11-19T00:19:36+05:30 IST

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మెన్‌ విభాగంలో పి.కల్యాణ్‌, ఇన్‌లైన్‌ హాకీ జూనియర్స్‌ విభాగంలో జశ్వంత్‌, హరిప్రియ ప్రథమ సాధించారని కోచ్‌లు ఎం.లక్ష్మణ్‌, ఎం.చంటికృష్ణ తెలిపారు. జన్మభూమిపార్కులో శుక్రవారం విలేకర్లకు

స్కేటింగ్‌ పోటీల్లో ప్రతిభ

కాకినాడ అర్బన్‌, నవంబరు 18: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మెన్‌ విభాగంలో పి.కల్యాణ్‌, ఇన్‌లైన్‌ హాకీ జూనియర్స్‌ విభాగంలో జశ్వంత్‌, హరిప్రియ ప్రథమ సాధించారని కోచ్‌లు ఎం.లక్ష్మణ్‌, ఎం.చంటికృష్ణ తెలిపారు. జన్మభూమిపార్కులో శుక్రవారం విలేకర్లకు వారు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేర్‌రెడ్డి సహకారంతో విద్యార్థులు ప్రతిభ సాధించారన్నారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచి డిసెంబరు 11, 12న బెంగళూరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. స్కూల్‌ ఫెడరేషన్‌ స్కేటింగ్‌ కాకినాడ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. జిల్లాస్థాయిలో జి.జేమ్స్‌, అహన్‌ మంగేష్‌, కె.చర్మిక గెలుపొందారన్నారు. రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజగోపాల్‌, కార్యదర్శి దొరస్వామి, మాజీ కార్పొరేటర్‌ నల్లబిల్లి సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:19:38+05:30 IST