పోలీస్ గ్రీవెన్స్కు 77 అర్జీలు
ABN , First Publish Date - 2022-12-12T23:51:00+05:30 IST
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాక విసిగి వేశారిపోయిన అర్జీదారులు జిల్లావ్యాప్తంగా 77మంది సోమవా రం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబును పోలీస్ గ్రీవ్న్స్లో ఆశ్రయించి తమ గోడును విన్నవించారు. ఎస్పీ అర్జీలను స్వీకరించి సమస్యలు సత్వరం పరిష్కారించాల్సిందిగా సంబంధిత పోలీస్ అధి
కాకినాడ క్రైం, డిసెంబరు 12: వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాక విసిగి వేశారిపోయిన అర్జీదారులు జిల్లావ్యాప్తంగా 77మంది సోమవా రం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబును పోలీస్ గ్రీవ్న్స్లో ఆశ్రయించి తమ గోడును విన్నవించారు. ఎస్పీ అర్జీలను స్వీకరించి సమస్యలు సత్వరం పరిష్కారించాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల కోసం కాకినాడ రామారావుపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ డీపీఆర్ స్వామి ఏర్పాటు చేసిన భోజన సదుపాయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వడ్డించారు. అడ్మిన్ ఎస్పీ పి.శ్రీనివాస్, ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు, టూటౌన్సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు పాల్గొన్నారు.