‘ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిశీలించాలి’
ABN , First Publish Date - 2022-12-07T00:14:42+05:30 IST
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్, సిటీ నియోజకవర్గ ఈఆర్వో కె.రమేష్ సి బ్బందికి సూచించారు. ఈ విషయమై మంగళవారం ఏఈ ఆర్వోలు
కార్పొరేషన్ (కాకినాడ), డిసెంబరు 6: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్, సిటీ నియోజకవర్గ ఈఆర్వో కె.రమేష్ సి బ్బందికి సూచించారు. ఈ విషయమై మంగళవారం ఏఈ ఆర్వోలు, ఎన్నికల సిబ్బందితో కమిషనర్ సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఓటర్ల జాబితాలో దోషాలను సరి చేయడం, మార్పులు, చేర్పులు, 18ఏళ్లు నిండే యువతకు ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను ఈనెల 8వ వరకు గడవు ఉందని ఆయన తెలిపారు.