అన్ని పాఠశాలలకు ఏకకాలంలో ప్రశ్నాపత్రాలు: కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-07T00:21:04+05:30 IST
విద్యార్థులకు నిర్వహిస్తున్న పార్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు ఏకకాలంలో అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఆమె మంగళవారం పిఠాపురం బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశా
పిఠాపురం, డిసెంబరు 6: విద్యార్థులకు నిర్వహిస్తున్న పార్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు ఏకకాలంలో అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఆమె మంగళవారం పిఠాపురం బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధన ఇస్తున్నామ న్నారు. నాడు-నేడు కింద గతేడాది రూ.50లక్షలతో టాయిలెట్స్, ఆర్వో వాటర్ప్లాంటును ఆధునీకరించామన్నారు. ఆర్డీవో బీవీ రమణ, మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్ ఉన్నారు.