ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-05-21T06:40:33+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తికావాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధలు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలత అన్నారు.
చాగల్లు, మే 20: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తికావాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధలు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలత అన్నారు. శుక్రవారం స్థానిక జగనన్నకాలనీలో ఆమె పర్యటించి మౌలిక వసతులపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ఐరన్, సిమెంట్, ఇసుకకు కొరత లేకుండా లేఅవుట్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, విద్యుత్, తాగునీరు, రహదారులు ఇతర మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జి.సత్యనారాయణ, ఆర్డీవో మల్లిబాబు, డ్వామా ఇన్చార్జి పీడీ పి.జగదాంబ, సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి, ఎంపీడీవో బి.రామ్ప్రసాద్, ఏఈ హౌసింగ్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.