నేడు రైతులకు ఉచిత భోజనం

ABN , First Publish Date - 2022-09-17T05:34:37+05:30 IST

పిఠాపురం, సెప్టెంబరు 16: వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురంలోని పశువుల సంతకు తరలివచ్చే రైతులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్‌ తెలిపారు. పశువుల సంత జరిగే ప్రతి శనివారం ఈ సదు

నేడు రైతులకు ఉచిత భోజనం

పిఠాపురం, సెప్టెంబరు 16: వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురంలోని పశువుల సంతకు తరలివచ్చే రైతులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్‌ తెలిపారు. పశువుల సంత జరిగే ప్రతి శనివారం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, సంతకు వచ్చే రైతు లు, ఇతరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-09-17T05:34:37+05:30 IST