ఫిట్ ఇండియా ర్యాలీ
ABN , First Publish Date - 2022-11-01T01:38:24+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలో సోమవారం డొంకరాయి సీఆర్పీఎఫ్సీ/42 బెటాలియన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా సీఆర్పీఎఫ్సీ/42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం.రాధా ఆధ్వర్యంలో బైక్, సైకిల్ ర్యాలీ, పాఠశాల విద్యార్థులతో రన్ ర్యాలీ నిర్వహించారు.
మోతుగూడెం, అక్టోబరు 31: అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలో సోమవారం డొంకరాయి సీఆర్పీఎఫ్సీ/42 బెటాలియన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా సీఆర్పీఎఫ్సీ/42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం.రాధా ఆధ్వర్యంలో బైక్, సైకిల్ ర్యాలీ, పాఠశాల విద్యార్థులతో రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డొంకరాయి పురవీఽధుల్లో జరిగింది. డొంకరాయి గ్రామంలో రోడ్డు మీద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చి పడేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.