అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సేవలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-04-29T06:18:40+05:30 IST

అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ సేవలు అనుసరణీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాఽథ్‌బాబు పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో యువత సేవా మార్గంవైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సేవలు స్ఫూర్తిదాయకం
పి.గన్నవరం అక్విడెక్టు వద్ద డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు

పి.గన్నవరం, ఏప్రిల్‌ 28: అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ సేవలు అనుసరణీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో యువత సేవా మార్గంవైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతమ్మ స్ఫూర్తితో తాను ‘కోనసీమ ఆహార నిధి’ స్థాపించినట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్‌ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డొక్కా భీమకామేశ్వరరావు, ఆరుమల్లి లాల్‌బాబు, ఆకుల రాజు పాల్గొన్నారు.


మండపేట: ఆంధ్ర అన్నపూర్ణగా వెలుగొందిన డొక్కా సీతమ్మ మన పట్టణంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని పలువురు వక్తలు అన్నారు. సీతమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బూరుగుంట చెరువు వద్దనున్న ఆమె విగ్రహానికి పలువురు నాయకులు, వాకర్స్‌ క్లబ్‌తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఆకలి అంటే చాలు అన్నం పెట్టిన మహా తల్లిగా అమె సేవలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ న్యాయవాది కేఆర్‌సీ నారాయణరెడ్డి అన్నారు. పేదలకు అన్నదానం చేశారు.

Updated Date - 2022-04-29T06:18:40+05:30 IST