రాజమహేంద్రవరంలో పారిశుధ్యం అధ్వానం
ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST
నగరంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక 47వ డివిజన్లో ఆదిరెడ్డి వాసు స్ధానిక నాయకులు కవులూరి వెంకట్రా వు, బేసరి చిన్నిలతో కలిసి ఇంటింటికి వెళ్ళారు.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: నగరంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక 47వ డివిజన్లో ఆదిరెడ్డి వాసు స్ధానిక నాయకులు కవులూరి వెంకట్రా వు, బేసరి చిన్నిలతో కలిసి ఇంటింటికి వెళ్ళారు. ఈ సందర్భంగా స్థానికులు చెప్పిన డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్యలపై స్పందించారు. ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సదుపాయాలు కల్పించడంపై లేదన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బం దులు పడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. తెలుగుదేశానికి పూర్వవైభ వం తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరిశెట్టి శ్రీను, శ్యామల, గుంట రాము, బాబ్జి, సూరాచారి, మోతా నాగలక్ష్మి, దేవుడు, కొండలరావు, బోనేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు