జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-05-17T07:01:00+05:30 IST
రాజమహేంద్రవరం, మే 16 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.. దీనికోసం శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం హౌసింగ్, సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్క్లినిక్ నిర్మాణం పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపా
జిల్లా కలెక్టర్ కె.మాధవీలత
రాజమహేంద్రవరం, మే 16 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.. దీనికోసం శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం హౌసింగ్, సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్క్లినిక్ నిర్మాణం పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గ్రౌండింగ్, ఆర్సీ, స్లాబ్ లెవల్ వంటి పనులలో పురోగతిని వారంవారం చూపించాలన్నారు. కాలనీల్లో రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యా లు త్వరగా కల్పించాలని ఆదేశించారు. ఇసుక, సిమెంట్, ఐర న్ నిల్వలు ఉన్నాయని, ఇంటి నిర్మాణం కోసం ఇంకా ముం దుకు రాని లబ్ధిదారులు కట్టుకునేవిధంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, హౌసింగ్ పీడీ టి.తారాచంద్, ఇతర అధికారులు సోములు, పరశురాం పాల్గొన్నారు.