అభయహస్తం సొమ్ము లాగేసిన జగన్కు బుద్ధిచెప్పాలి
ABN , First Publish Date - 2022-12-10T00:54:13+05:30 IST
మహిళలు దాచుకున్న రూ.214 కోట్లు అభయహస్తం సొమ్మును లాగేసిన ఘనుడు సీఎం జగన్కు ఓటుద్వారా మహిళలే బుద్ధి చెప్పాలని జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మాకిరెడ్డి వీఎన్ఎస్ పూర్ణిమ పిలుపు నిచ్చారు.
అల్లవరం, డిసెంబరు 9: మహిళలు దాచుకున్న రూ.214 కోట్లు అభయహస్తం సొమ్మును లాగేసిన ఘనుడు సీఎం జగన్కు ఓటుద్వారా మహిళలే బుద్ధి చెప్పాలని జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మాకిరెడ్డి వీఎన్ఎస్ పూర్ణిమ పిలుపు నిచ్చారు. గోడిలో కడలి అచ్యుతం స్వగృహం వద్ద తెలుగు మహిళ మాటామంతి సమావేశం జరిగింది. విద్యుత్, గ్యాస్, నిత్యా వసర ధరలు పెరిగిపోయాయని, జగన్ పాలనలో మహిళ లకు రక్షణ లేదని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. పాద యాత్రలో జగన్ మద్యపాన నిషేధం చేస్తానని మాట తప్పి మద్యం ధరలు పెంచారని, కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పేదలకు చేరకుండా అమ్మేసుకుంటున్నారని ఆరో పించారు. చంద్రబాబు పాలనలో పేదలకు పంచదార, కంది పప్పు ఇచ్చే వారని, అమ్మఒడిలో జగన్ మోసాలను మహిళలు గుర్తించా లన్నారు. నియోజకవర్గ అధ్యక్షురాలు గెల్లా మీనాకుమారి, మట్టపర్తి భారతి, పేరూరి విజయలక్ష్మి, గెద్దాడ సత్యవాణి, అప్పారి సుశీల, సర్పంచ్ తోట శ్రీదేవి, ఎంపీటీసీ కాండ్రేగుల వాణీఅచ్యుతం, పలువురు మహిళలు పాల్గొన్నారు.