1,36,471 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ABN , First Publish Date - 2022-12-07T01:48:01+05:30 IST
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకూ 26,416 మంది రైతుల నుంచి 1,36,416 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.33.33 కోట్లు జమచేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్ తెలిపారు.
రైతులకు రూ.33.33 కోట్లు జమ : జేసీ
రాజమహేంద్రవరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) :
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకూ 26,416 మంది రైతుల నుంచి 1,36,416 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.33.33 కోట్లు జమచేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నామన్నారు.