భూ సర్వే డ్రోన్కు పూజలు
ABN , First Publish Date - 2022-06-29T07:14:49+05:30 IST
భూ సర్వే డ్రోన్కు పూజలు చేశాక సర్వే అధికారుల బృందం మొదలుపెట్టింది.
ఎర్రావారిపాలెం, జూన్ 28: ఎర్రావారిపాలెం మండలంలో భూ రీసర్వే చేపట్టేందుకు నాలుగు రోజుల క్రితం కమ్మళ్లయ్యగారిపల్లె వద్ద ప్రయోగించిన డ్రోన్ అనూహ్యంగా విరిగిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం అధికారుల బృందం డ్రోన్కు పూజలు చేశాక సర్వే మొదలుపెట్టింది. ఈ డ్రోన్ ఒక్కసారి ఎగిరాక 350 ఎకరాలకు చెందిన భూమి ఛాయాచిత్రాలు తీయగలదు. చిన్నతరహా డ్రోన్ ఇదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రామి రెడ్డి, రెవెన్యూ అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం పాల్గొన్నారు.