తిరుమలేశుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2022-09-11T06:34:09+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణిస్వామి, ఏపీ ట్రాన్స్పోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, సత్యనారాయణరాజు, మహేంద్రరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఉన్నారు. ఈ మేరకు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.